బాన్సువాడ, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిజామాబాద్ జిల్లాలోనే కల్లూరు గ్రామంలో మొట్టమొదటి మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డివో విజయకుమారి, డిఆర్డిఎ పీడీ సాయన్న, ఈఈ పిఆర్ వీరానంద్, పోతంగల్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

