డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో రాంపూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గోదాములను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండడానికి గోదాములను నిర్మించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎన్ డి సి సి చైర్మన్ రమేష్ రెడ్డి, ఎన్ డి సి సి వైస్ చైర్మన్ నల్ల చంద్ర శేఖర్ రెడ్డి, ఐ సి డి ఎం ఎస్ చైర్మన్, రాంపూర్ సొసైటీ చైర్మన్ తారాచంద్ నాయక్,పీసీసీ డెలికేట్ శేఖర్ గౌడ్, డిచ్పల్లి సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్, డిచ్ పల్లి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచెటి గంగాధర్, వాసు బాబు ధర్మ గౌడ్, శ్యామ్ సన్, ఎన్ డి సి సి అధికారులు, రాంపూర్ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

