విద్యార్థులకు వైద్య పరీక్షలు

0 18,602

మోర్తాడ్, బతుకమ్మ: వర్షాకాలం కావడంతో విద్యార్థులు వ్యాధుల భారిన పడకుండా ఉండాలని ముందస్తు జాగ్రత్తల లో భాగంగా బుధవారం మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కమ్మర్ పల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రాజేశ్వర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలని విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.