కమ్మర్ పల్లీ, బతుకమ్మ: కమ్మర్ పల్లీ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను బుధవారం డిప్యూటీ డిఎంహెచ్వో రమేష్ తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను, ల్యాబ్ ను, మందుల నిలువలను తదితర వాటిని పరిశీలించారు. ఆరోగ్య కేంద్ర పరిధిలో గల గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి తెలియజేశారు. కార్యక్రమంలో వైద్యులు రాజేశ్వర్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
