- జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్
- బాలికల హాస్టల్ తనిఖీ చేసిన జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్
బతుకమ్మ న్యూస్: మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం జుక్కల్ జుక్కల్ హాస్టల్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారమే బాలికల విద్యార్థులకు భోజనం అందించాలని ఆయన ఆదేశించారు. బాలికల హాస్టల్ లో విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. జుక్కల్ లో బాలికల హాస్టల్లో విద్యార్థులకు డ్రైనేజీ సమస్య ఉన్నప్పటికీ వెంటన డ్రైనేజ్ పనులు చేస్తామని హామీ ఇచ్చారు. రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బాలికల హాస్టల్ వార్డెన్ వీణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

