శ్రీనగర్, బతుకమ్మ : భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే శనివారం ఉదయం శ్రీనగర్ లో పాక్ దాడులకు దిగింది. దీంతో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. మధ్యాహ్నం మరోసారి భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ సమీపంలో రెండు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు, శ్రీనగర్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే సైరన్లు మోగుతున్నాయి.
