భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పలు భాధిత కుటుంబాలను డీసీసీ ప్రెసిడెంట్, స్టేట్ కోప్రటివ్ కార్పొరేషన్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఇందులో భాగంగా మండలంలోని బాబాపూర్ కు చెందిన మంద గోవర్ధన్ వాళ్ల తాత ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బడా భీమ్ గల్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు ఆకుల గణేష్ వాళ్ల నానమ్మ మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వారి కుంటుంబాలను తన సంతాపాన్ని తెలియజేశారు.ఆయన వెంట మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
