- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ , బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గం కొల్లూరు, నాగారం గ్రామాల ప్రజలు ఫంక్షన్ హాల్ను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని కొల్లూరు గ్రామంలో రూ. 40 లక్షలతో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్, 50 డబుల్ బెడ్ రూమ్లను ప్రారంభించారు. నియోజకవర్గంలో 120 ఫంక్షన్ హాళ్లు మంజూరు చేశానన్నారు. కొల్లూరు గ్రామానికి రూ. 3.50 కోట్ల వివిధ పనులకు మంజురు చేశానని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూంలకు నీటి ట్యాంక్ను మంజురు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, వెంకన్న, ఎజాజ్, నార్ల సురేష్, మధుసూదన్ రెడ్డి, శ్రావణ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.