డిల్లీ, బతుకమ్మ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ ( వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా- గ్రామీణ్) మిషన్ బిల్లుకు గురువారం లోక్ స భ ఆమోదం తెలిపింది. ఈ ఆమోద సమయంలో విపక్షాలు స్పీకర్ వెల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశాయి. ఈబిల్లు పత్రాలను విపక్షాలు చించి వేసి నిరసన తెలిపాయి. ఈబిల్లు ఆమోదం తర్వాత లోక్ సభ శుక్రవారానికి వాయిదా పడింది.