భీమ్ గల్ , బతుకమ్మ : పట్టణ కేంద్రం లోని శ్రీ సాయి నగర్ కాలనీలో నిర్మించతలపెట్టిన సెల్ టవర్ నిర్మాణం పనులను విరామించుకోవాలని, కాదని నిర్మాణం పనులు చేపడితే పనులను అడ్డుకొంటమని, కాలనీ మహిళలు హెచ్చరించారు. రాత్రికి రాత్రి సెల్ టవర్ నిర్మాణం కోసం అస్థలం వద్దకు జనరేటర్, ఇతర నిర్మాణ సామాగ్రిని తీసుకురావడంతో నిర్మాణం పనిని మహిళాలు మంగళవారం అడ్డుకొన్నారు. తమ కాలనీ లో సెల్ టవర్ నిర్మాణం చేయొద్దని గతంలో నే పోలీసులకు, తహసీల్దార్ ఇతర అధికారులకు పిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. కాని టవర్ నిర్మాణం రాత్రి పూట యదా విధిగా చేస్తున్నారని ఆరోపించారు. టవర్ నిర్మాణం పనులను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. టవర్ నిర్మాణం చేయడం ద్వారా రేడియేషన్ ఇతర ఆరోగ్య సమస్యలు, దాని ద్వారా కలిగే ఇతర నష్టాలు వివరించారు. దాంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడారు. సమస్య పరిష్కారం కొరకు స్టేషన్ కు వచ్చి మాట్లాడుకోవాలని సూచించారు.
