నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కృపాల్ సింగ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏసీఈ వెంకటేష్, సూపరింటెండెంట్స్ వాణి, దీపక్, డీఈవో సీసీ రాజేష్ మాట్లాడుతూ విద్యారంగంలో ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయ సంఘం నాయకుడిగా, మరియు స్వచ్ఛంద సేవకుడిగా కృపాల్ సింగ్ అందరి మన్ననలను పొందడన్నారు. అన్ని రంగాలలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ.. స్ఫూ ర్తిదాయకంగా నిలిచాడని డీఈవో కార్యాలయ సిబ్బంది కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మహేందర్, శివకుమార్, దిలీప్, శోభన్, నిశాంత్, జావీద్, అస్రార్, శ్రీనివాస్, సుకేష్ పాల్గొన్నారు.