రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమం తొలితరం ఉద్యమకారులు, నిబద్ధత కలిగిన రాజకీయవేత్త కొండా కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఈ సహకార సంఘం అధ్యక్షులు మోత్కూరి నారాయణ, డైరెక్టర్ నూత్ పల్లి గణేష్, మేనేజర్ ఈర్వ నాగరాజు, పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు.
