మద్నూర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామం లో శనివారం ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి జరుపుకున్నారు. వారు మాట్లాడుతూ… నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పద్మశాలి సంఘం నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాస్, రాములు, కిషన్, పోశెట్టి, వెంకట్, గంగాధర్, భాస్కర్, శంకర్, వెంకటరమణ, బాలాజీ, రాజు, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
