కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదు
తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అన్నింటికీ అడ్డుపడుతోంది కిషన్ రెడ్డి
డిల్లీ,బతుకమ్మ : రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంతవరకు కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. తెలంగాణలో జరిగిన మంత్రివర్గ విస్తరణ పై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. కర్ణాటకలో కులగణనకు సంబంధించి మాత్రమే చర్చించామన్నారు. రెండు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మీడియా సమావేశం పెడతానన్నారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బయట పెడతానన్నారు. తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అన్నింటికీ అడ్డుపడుతోంది కిషన్ రెడ్డే అని వ్యాఖ్యనించారు.
