రేపు అమెరికాకు ప్రయాణం
కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు..
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు బయలుదేరనున్నారు. 15 రోజుల పాటు ఆదేశంలో పర్యటించనున్నారు. చిన్న కుమారుడు ఆర్యను అమెరికాలోని కళాశాలలో గ్రాడ్యుయేషన్ లో కవిత చేర్పించనున్నారు. తన కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసం శుక్రవారం మధ్యాహ్నం ఫామ్ హౌస్ కు కల్వకుంట్ల కవిత వెళ్లనున్నారు. కవిత అమెరికా పర్యటనకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతించింది. అమెరికా పర్యటన ముగించుకుని సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ కు కవిత తిరిగి రానున్నారు.
