నిజామాబాద్, బతుకమ్మ: హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించనున్న దీక్షా దివస్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ముందు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న దీక్షా దివస్ లో కవిత పాల్గొంటారని భావించినప్పటికీ ఆమె హైదరాబాద్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో జిల్లాకు కవితక్క ఎప్పుడు వస్తారోననే చర్చ మళ్లీ బీఆర్ఎస్, జాగృతి శ్రేణులతోపాటు ఆమె అభిమానుల్లో మొదలైంది.
