బస్వాపూర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే

0 1,692

భిక్కనూరు, బతుకమ్మ:

భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీచర్ల అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీచర్ల సమయపాలన పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలన్నారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Kamareddy MLA who suddenly inspected the Baswapur school

Leave A Reply

Your email address will not be published.