కామారెడ్డి, బతుకమ్మ: పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభచాటిన జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల విద్యార్థులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం సన్మానించి అభినందించారు.
ఎర్రపహాడ్ బాలుర గురుకుల విద్యార్థి బామన్ రమేశ్(587 మార్కులు), జంగంపల్లి గర్ల్స్ హాస్టల్ విద్యార్థిని పైడి మౌర్యానంద్ రెడ్డి(581), నిజాంసాగర్ బాలుర హాస్టల్ విద్యార్థి చైతన్య(570), బీబీపేట్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు మంజా శివ(576), గాదె అనిరుధ్(572), పిట్లం గర్స్ల్ హాస్టల్ విద్యార్థిని తోపాటు ఎం. రక్షిత(579)ని కలెక్టర్ సన్మానించారు.

