రైతులు యూరియా వాడకం తగ్గించాలి
ధరూర్ లో ’రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు‘ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి తుమ్మల
వికారాబాద్, బతుకమ్మ : యూరియా అధికంగా వాడి మనల్ని పోషించే భూతల్లిని నాశనం చేయొద్దని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వికారాబాద్ జిల్లా ధరూర్ లో ’రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు‘ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ రంగంలో మరిన్ని మార్పులు రావాలని మంత్రి అన్నారు. వరిసాగులోను పాక్షికంగా ఆరుతడి విధానం పాటించాలన్నారు. పురుగుమందులు, యూరియా వాడకం తగ్గించాలన్నారు. ఆయిల్ పాం సాగుతో రైతులకు మంచి ఆదాయం వస్తోందన్నారు. రంగా రెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో దీన్ని సాగుపెరగాలన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాలో ఈపంట సాగుకు అనుమతి ఉందన్నారు. గత ప్రభుత్వం పంట బీమాను పట్టించుకోలేదన్నారు. ఈప్రభుత్వం పంటల బీమాను మళ్లీ పునరుద్ధరించనుందన్నారు.
