30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక : నామినేషన్ వేసిన మాగంటి సునీత

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ బుధవారం నామినేషన్‌ వేశారు.  షేక్‌పేటలోని తహసీల్దార్‌ కార్యాలయంలో  ఎన్నికల రిటర్నింగ్ అధికారికి  ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప‌ద్మారావు గౌడ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు  రావుల శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, దీదీప్య రావు, సమీనా  యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. ఈఏడాది జూన్ 8న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య సమస్యలతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11 న పోలింగ్ జరగనుంది. 14 న లెక్కింపు చేపట్టనున్నారు.

More articles

Latest article