బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన మత్స్యకార సంఘం సభ్యులు ఆదివారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజాపాలనకు మద్దతుగా ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో పని చేయుటకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సంఘ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
