ఆర్మూర్, బతుకమ్మ : జక్రాన్ పల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ని మర్యాదపూర్వకం గా కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరీ వినోద్ కుమార్, మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ గన్న లక్ష్మణ్, మండల మైనార్టీ అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్ మాజీ వైస్ ఎంపీపీ జితేందర్ నాయక్. ఇందిరమ్మ కమిటీ మెంబర్ నట్ట తిరుపతి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
