రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో జై కిసాన్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. జై కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా కర్క అశోక్, ఉపాధ్యక్షులుగా గుర్ల గోపి, పార్వతి ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా పార్వతి శేఖర్, సంయుక్త కార్యదర్శులుగా పార్వతి రోహిత్, దుర్కి రవి, కోశాధికారిగా పార్వతీ నరేష్, గౌరవ సలహాదారులుగా పత్తి రాము, ఉప్పు గంగాధర్, నాగం అశోక్, దుర్కి సాయన్న, పార్వతి మురళి, పార్వతి రాములు, సంఘ డైరెక్టర్లుగా గుర్ల సురేష్, బండారి నగేష్, కాసుల ఉమామహేశ్వర్, గుర్ల ప్రమోద్, పార్వతి సుమన్, గొడుగు లేలెంధర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షులు కర్క అశోక్ ను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
