ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జై గౌడ్ ఉద్యమ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జై గౌడ్ ఉద్యమ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ గురించి అలాగే తాల్ల రాంపూర్ గ్రామంలో జరిగిన సంఘటన పై ఆది శ్రీనివాస్ కు క్లుప్తంగా వివరించినట్లు తెలిపిన నాయకులు. ప్రభుత్వ విప్ ను కలిసిన వారిలో జై గౌడ ఉద్యమం రాష్ట్ర అధికార ప్రతినిధి ముష్కం దత్తాద్రి గౌడ్, జిల్లా అధ్యక్షులు పందిర్ల లింగం గౌడ్,జిల్లా అధికార ప్రతినిధి గంట వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులు గుర్రం సత్యనారాయణ గౌడ్, మండల అధ్యక్షులు ఆరెల్లి రమేష్ గౌడ్ లు ఉన్నారు.