మోర్తాడ్, బతుకమ్మ: ఇటీవల టీజీహెచ్ఏంఏ (తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్)నిజామాబాద్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన చొప్పదండి శ్రీనివాస్, రఘునందన్ చారిలు ఎన్నిక కావడం సంతోష్ కరమైన విషయమని మోర్తాడ్ విద్యాధికారి సమ్మిరెడ్డి అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సమావేశంలో వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో పలు సమస్యలపై ఇచ్చినట్లు అన్ని పేర్కొన్నారు. ప్రభుత్వ వెంటనే మిగతా బిల్లులు వెంటనే విడుదల చేయాలిని మల్టీజోన్ స్థాయిలో పనిచేయుచున్న జిహెచ్ఎంలను వెంటనే బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనైనది. కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఏ ప్రభాకర్, సి సంతోష్ కుమార్, శెట్ పల్లి జిహెచ్ఎం వెంకటయ్య, వేణుగోపాలరావు, ధర్మవరం కృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు.
