హైదరాబాద్, బతుకమ్మ : జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉండొచ్చని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన సాజిద్ను సైఫుల్లా కసూరీగానూ పిలుస్తారు. ఎన్ఐఏ ఇతడిని కరడుగట్టిన ఉగ్రవాదిగా పేర్కొంది. ప్రస్తుతం ఇస్లామాబాద్ నుంచి ఇతడు ఆపరేషన్స్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థానీ ఐఎస్ఐ, ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.