ప్రాణం తీసిన ఐరన్ మెట్లు

0 8,162

 కోటగిరి, బతుకమ్మ : ఐరన్ మెట్లపై కూర్చోవడంతో విద్యుత్ షాక్ కు  గురై వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తుండ గ్రామంలో చోటుచేసుకుంది. ఎత్తోండ గ్రామానికి చెందిన తాళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి భోజనం ముగించుకొని తన ఇంటి ఆవరణలో గల ఐరన్ మెట్లపై కూర్చోవడంతో ఇంటికి గల విద్యుత్ సర్వీసెస్ వైర్ తెగి మెట్ల మీద పడింది.  దీంతో మెట్లపై కూర్చున్న తాళ్ల శ్రీనివాస్  కు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

Leave A Reply

Your email address will not be published.