28.8 C
Hyderabad
Monday, August 3, 2026

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా భూపాలపల్లి కోర్టులో ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి మృతి చెందాడని కోర్టుకు కేసీఆర్ తరపు న్యాయవాది తెలిపారు. భూపాలపల్లి జిల్లా కోర్టుకు విచారణార్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేశారని పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. తదుపరి విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

More articles

Latest article