- విద్యుత్ శాఖలో జగ్జీవన్ కు అవమానం
ఇందూర్, బతుకమ్మ: బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతిని పురస్కరించుకొని విద్యుత్ ప్రగతి భవన్ కార్యాలయం ఎదుట చెప్పులు వేసుకొని నివాళులు అర్పించారు. ఏదైనా కార్యక్రమం చేసే సందర్బంలో కాళ్లకు ఉన్న చెప్పులను విడిచి చేస్తుంటారు. ఇక్కడ సర్కిల్ ఎస్ఈతో పాటు కార్యాలయంలో పని చేసే మేధావులు చెప్పులు వేసుకొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మేధావులు అయి ఉండి అవివేకవంతమైన పనులు చేసి, బాబు జగ్జీవన్ రామ్ ను కావాలనే అవమాపరిచారనే ప్రచారం కాంపౌండ్ లో జరుగుతోంది.
