ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని లింగారెడ్డి పేట, వెల్లుట్ల, వెల్లుట్లపేట, అన్నసాగర్, అజామాబాద్ పీపీసీ సెంటర్ లను ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీయనుకోవాలని సూచించారు. సెంటర్ల వద్ద మంచినీటి వసతులు ఏర్పాటు చేయాలని, తూకంలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని ఆదేశించారు. రికార్డులు పరిశీలించారు. రైతులకు వారి కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

