బాన్సువాడ , బతుకమ్మ : సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో సోమవారం ఆయన పర్యటించారు. ఇళ్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. కాలనీలో వీధి లైట్లు, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరగా, సంబంధిత అధికారులతో మాట్లాడారు. తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో బషీరొద్దీన్, విద్యుత్ ఏఈ అనిల్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఎజాజ్, శ్రీశైలం, నర్సింలు, కాశీరాం తదితరులు పాల్గొన్నారు.
