వెబ్ డెస్క్, బతుకమ్మ : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లు డారిల్ మిచెల్ (63), బ్రాస్ వెల్ (53 నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ రెండేసి వికెట్లు తీయగా షమీ, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.