. ఉప ఎన్నిక వస్తే వెనకడుగు వేయను.. మళ్లీ బరిలో నిలుస్తా
. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
వరంగల్, బతుకమ్మ: పార్టీ ఫిరాయించి వచ్చిన వారిని మంత్రులను చేసిన ఘనత బీఆర్ఎస్ ది అని, వారు చేస్తే సంసారం.. మేము చేస్తే వ్యభిచారమా? అని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు సుద్దపూసల్లా మాట్లాడుతున్నారని, ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు వస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని మళ్లీ బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు.
