మహాకుంభ మేళాకు పోటెత్తుతున్న భక్తులు
ప్రయాగ్ రాజ్, బతుకమ్మ : మహాకుంభ మేళాలో ఈనెల 8వ తేదీ వరకు 42 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గత నెల 13వ తేదీన కుంభమేళా ప్రారంభం కాగా, సుమారు 50 కోట్ల మంది భక్తులు తరలివస్తారని, అందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ ఈనెల 8వ తేదీ నాటికే 42 కోట్ల మందికిపైగా భక్తులు అమృత స్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి పర్వదినాన కుంభ మేళ ముగియనుండగా, మరో 18 కోట్ల మంది వరకు భక్తులు తరలివస్తారని అంచనా.
