26.2 C
Hyderabad
Monday, August 3, 2026

నిరుపేద వధువు వివాహానికి పుస్తే, మట్టెల వితరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ: బిచ్కుంద : నిరుపేద వధువు వివాహానికి మానవతా దృక్పథంతో పుస్తే మట్టెల పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.  బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ సద్గురు బండయ్యప్ప గోల్డ్ షాప్ వారి తరఫున మద్నూర్ మండలం రుసేగంగ్రామంలోని వధువు కు పుస్తె మట్టేలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుసేగం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం  వివాహం చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి రాగానే ఆ నిరుపేద కుటుంబానికి మా వంతు సహకారంగా వివాహానికి పుస్తె మట్టెలు అందజేయడం జరిగిందన్నారు. ఎన్ని ఆస్తులు డబ్బులు సంపాదించిన కలగని సంతోషం నిరుపేద కుటుంబాలకు సహాయం చేయడంలో ఎంతో సంతోషం కలుగుతుందన్నారు. కష్టాలలో ఉన్న వారికి మానవత్వంతో మన వంతు సహాయం చేయడం ఎంతో సంతోషకరమనిపేర్కొన్నారు.

More articles

Latest article