కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన కే. సౌందర్య అనే మహిళకు గుండె సంబంధిత ఆపరేషన్ నిమిత్తం రూ. 2.50 లక్షల ఎల్ ఓ సీని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. అనారోగ్యం తో బాధపడుతూ డాక్టర్ ను సంప్రదించగా గుండెకు సంబందించిన ఆపరేషన్ అవసరమని చెప్పడంతో అందుకు అయ్యే ఖర్చు కై ఎల్ ఓ సీ ఇప్పించలని స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేను కోరగా వెంటనే స్పందించి సౌందర్య కు ఎల్ ఓ సి ని మంజూరు చేయించి భాదితురాలికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అందజేశారు.ఈ సందర్బంగా భాధితరాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కు ఎల్ల వేలాల రుణపడి ఉంటామని, అయనకు కృతజ్ఞతలు తెలిపారు.
