బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని శుక్రవారం డిప్యూటీ డిఎంహెచ్ ఓ రమేష్ తనిఖీ చేశారు. ఆరోగ్య ఉపకేంద్రం సిబ్బందితో మాట్లాడుతూ, ఫ్రైడే,డ్రై డే, గురించి తగు సూచనలు చేస్తూ, కుటుంబ నియంత్రణ,( వ్యస క్తమి) మగ వారికి మోర్తాడ్ లో ఈనెల 23న ఆపరేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ చేయించుకునే వారు మోర్తాడ్ కు వెళ్లేటట్లు చూడాలని హాస్పిటల్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రక్షిత రెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి, సిహెచ్ మోతిరామ్, పండరి, మోహన్, హెల్త్ అసిస్టెంట్స్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.