వెబ్ న్యూస్, బతుకమ్మ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హెచ్ సీయూ రిజిస్ట్రార్ కు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు నివేదిక అందించాలని రిజిస్ట్రార్ ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడం లేదని తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి చర్యలు చేపటొద్దని సుప్రీం కోర్టు తెలిపింది.