జిల్లా ఇంచార్జీ సీపీ సింధూశర్మ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రజలకు జిల్లా ఇంచార్జీ సీపీ సింధూ శర్మ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సర కాలంలో ప్రజలందరు వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో గడపాలని కోరారు. అహంకారం, స్వార్థం, అసూయలతో కూడిన చీకట్లను పారద్రోలి మంచి దీవం ” వెలిగించి పది మందికి వెలుతురును ఇవ్వాలని అన్నారు. పిల్లలు బాణ సంచాలు కాల్చేటప్పుడు కుటుంబ పెద్దలు దగ్గర ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగ కుండా అందరు సహకరించాలని కోరారు. ఎల్లప్పుడు ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా, సోదర భావంతో మెలుగాలని అన్నారు.
