-మండల అధ్యక్షులు ఇమ్మడి సాయిలు
ఇందల్వాయి,బతుకమ్మ : వికలాంగులను ప్రభుత్వం ఆదుకోవాలని మండల వికలాంగుల సమైక్య అధ్యక్షులు ఇమ్మడి సాయిలు అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో సోమవారం వికలాంగుల సమైక్య అధ్యక్షులు ఇమ్మడి సాయిలు మాట్లాడుతూ వికలాంగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా జీవను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకాలు ఉదృతంగా చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలను ఎన్నో ప్రభుత్వాలు మారిన ఇప్పటివరకు తమ గోడు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వికలాంగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. .
వికలాంగులను ప్రభుత్వం ఆదుకోవాలి
