వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని రామన్నపేట్ గవర్నమెంట్ హై స్కూలుకు చెందిన ముగ్గురు ఆణిముత్యాలు ఐఐఐటీకి ఎంపికయ్యారు. ఎస్సేస్సీ లో ఏం. రచన 569 మార్కులు, శివాని 557 మార్కులు, నందిని 552 మార్కులు సాధించగా వీరు ట్రిపుల్ ఐ కి ఎంపికయ్యారు.ట్రిపుల్ ఐటి ఎంపికైన చిన్నారులను స్థానిక గ్రామ కమిటీ, పేరెంట్స్ కమిటీ తో పాటు స్కూల్ హెడ్ మాస్టర్ శివాజీ, టీచింగ్ స్టాఫ్ అభినందించారు.


