హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం రెండు దగ్గు మందులపై నిషేధం విధించింది. రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ దగ్గు మందులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈరెండు ఫార్మా కంపెనీల మెడిసిన్స్ గుజరాత్ కు చెందినవి. ఈ రెండు దగ్గు మందులను మెడికల్ షాపుల్లో విక్రయించొద్దంటూ (డీసీఏ) డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు చేసింది. ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తించింది. కాగా, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ల్లో కోల్డ్ రీఫ్ దగ్గు మందు సేవించి 11 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
