రుద్రూర్, బతుకమ్మ: గురు పౌర్ణమిని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం గోపాల కలువ వేడుకలను నిర్వహించారు. ఉట్టి పగులకొడుతు, పేలాల లడ్డు ఎగురవేస్తూ గోపాల కలువ వేడుకలను జరుపుకున్నారు. అదేవిధంగా ప్రధానవీధుల గుండా శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి శోభయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
