నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తోటి ఉద్యోగిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఖలీల్ వాడిలోని పూజ ఆసుపత్రిలో విధుల్లో ఉన్న ఒక యువతిపై ఆసుపత్రి సిబ్బందితో పాటు అతని ముగ్గురు స్నేహితులు కలిసి సామూహికంగా దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన యువతి వారి నుంచి తప్పించుకుని డయల్ 100కు ఫోన్ చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలిని విచారించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
