మహిళపై నలుగురి అఘాయిత్యం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లాలో మహిళపై నలుగురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డా సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. బాధితురాలు స్థానిక పోలిస్ స్టేషన్ లో పిర్యాదుతో ఈ ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. ఓంటరిగా ఉండే మహిళను నలుగురు వ్యక్తులు అటో లో నిజామాబాద్ బస్టాండ్ వద్ధ నుంచి డిచ్ పల్లి తీసుకువేళ్లి అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అఘాయిత్యానికి పాల్పడిన వారు డిచ్ పల్లికి చెందిన వారు కావడంతో అక్కడే మహిళను వదిలి వేయడంతో నిజామాబాద్ కు చెరుకుని స్థానిక పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు తెలిసింది. శనివారం ఉదయం బాధిత మహిళను వెంట బెట్టుకుని పోలిస్ లు ఘటన జరిగిన స్థలానికి తీసుకువేళ్లి పరిశీలించారు. బస్ స్టాండ్ వద్ధ ఆటోకు సంబందించిన విడియో పుటేజీలను పరిశీలిస్తున్నారు. మహిళ ఇష్టపూర్వకంగానే వేళ్లిందని కాని అక్కడ నలుగురు బలవంతం చేయడంతోనే పిర్యాదు చేసిందని పోలిస్ వర్గాలు చెబుతున్నాయి. అదే కోణంలో ధర్యాప్తు చేస్తు్నారు పోలిసులు.
