నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : రైతు వేదికలకు వీడియో కాన్పరెన్స్ అనుసంధానం ద్వారా రైతులకు మేలు కలుగుతుందని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సంక్షేమ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామంలో 1031 రైతు వేదికలకు వీడియో కాన్పరెన్స్ అనుసంధానం కార్యక్రమం మంగళవారం జరిగింది. ముఖ్య అతిధిగా గడుగు గంగాధర్ పాల్గొని మాట్లాడుతు… తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీఓ రాజేందర్, వ్యవసాయ అధికారి హిరా, గుండారం సొసైటీ చైర్మెన్ దాసరి శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.
