నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జి.జి. కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించు “అకాడమిక్ రైటింగ్” అనే అంశంపై జాతీయ కార్యశాల కరపత్రంను శనివారం ప్రిన్సిపల్ డా. పి. రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డా.ఎస్.రంగరత్నం, కార్యశాల కన్వీనర్ డా. ఉమాకిరణ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ నహీదబేగం, ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డా.రాజేష్, పి.ఆర్.ఓ డా.దండు స్వామి, కామర్స్, బి.బి.ఏ అధిపతులు డా.వినయ్ కుమార్, డా.రంజిత, డా.ముత్తెన్న, డా.చంద్రశేఖర్, రమేష్ గౌడ్, రాహుల్, రామకృష్ణ, పూర్ణచందర్ రావు, బాలమణి, డా. టి.చంద్రశేఖర్, గోపాల్, నరేశ్ కుమార్, గంగాధర్, కార్యాలయ సిబ్బంది ఏఓ. రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయభాస్కర్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
