28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జీవన్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ : సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, వినయ్‌రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శనివారం కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా నందిపేటలో  జీవన్‌రెడ్డి దిష్టిబొమ్మకు కాంగ్రెస్ నాయకులు శవయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదని జీవన్‌రెడ్డిని హెచ్చరించారు.  ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ  నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలపై ఆరోపణలు చేయడం దారుణమని చెప్పారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జీవన్ రెడ్డి రాజకీయ చరిత్రను బయటపెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

Funeral procession for Jeevan Reddy effigy

More articles

Latest article