నివాళులు అర్పించిన ప్రభుత్వ సలహాదారు పోచారం
నిజామాబాద్, బతుకమ్మ : రిటైర్డ్ ఆర్టీవో, విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం మాజీ అధ్యక్షులు శివచరణ్ గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. నగరంలోని గాజుల్ పేటలోని శివచరణ్ ఇంటి వద్ద ఆయన మృతదేహానికి శుక్రవారం ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శివచరణ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంచి మిత్రుణ్ణి కోల్పోయానని చిన్ననాటి జ్ఞాపకాలను ఎమ్మెల్యే పోచారం గుర్తు చేసుకున్నారు.