ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల పరిధిలోని తిర్మాన్ పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ జంగిడి లక్ష్మి పది రోజుల క్రితం పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్న మాజీ ఎంపీటీసీ జంగిడి లక్ష్మి శనివారం అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందిందని ఎస్సై సందీప్ తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.